వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యవాలంటీర్లు బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు.అరసవల్లి సూర్య మహల్ జంక్షన్ మీదుగా సాగిన ఈ యాత్ర న్యూ కాలనీ సత్యసాయి మందిరం వరకు కొనసాగింది. సాయి మందిరంలో గణపతి నవరాత్రులని సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు..