ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు గురువారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు. మరమ్మతుల కారణంగా బ్రాహ్మణ పల్లె, రెడ్డి చర్ల, ఎర్ర పల్లి, మూలపల్లి, మల్లారెడ్డిపల్లి, మిట్టమీదిపల్లి, మదవపల్లి, పామూరు పల్లి, గోనెపల్లి, బాబాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు రాజుపాలెం పంచాయతీలో మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల 30 నిమిషాల వరకు కొమరోలు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.