కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బాన్సువాడ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం 11:30 గంటలకు ఆందోళనలు చేపట్టారు. బాన్స్వాడ నర్సుల్లాబాద్ వర్ని రుద్రూర్ మండలాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.