నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుందని మంగళవారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లోగా 101385 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి అవుట్ ఫ్లోగా 99852 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు,4.699 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటిమట్టం 694.500 అడుగులు 3.399 టీఎంసీలలో నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ప్రవాహా ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.