నల్గొండ జిల్లా: తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా పదవ మహాసభల కరపత్రాలను నల్గొండ పట్టణంలోని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ ఈనెల 20 నిర్వహించే మహాసభలను విజయవంతం చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.