ప్రజలకు సంక్షేమ కార్య క్రమాలతో పాటు అభివృద్ధి పనులు కూడా కూటమి ప్రాధాన్యం ఇస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. శనివారం పొందూరు మండలంలోని లోలుగు గ్రామం నుంచి వీఆర్ గూడెంనకు రూ.3.90 లక్షలతో నిర్మించినున్న బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధి పనులను మరింత పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేస్తామన్నారు.