మదనపల్లె ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా ఇమామ్, మౌజామ్లకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండడం దారుణం. వెంటనే ఆ వేతనాలను విడుదల చేసి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలి అని అన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి, మసీదులు, ఈద్గాలు, షాదీ ఖానాలను అభివృద్ధి చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.