కె. గంగవరం మండలం దంగేరు హైస్కూల్ను మంగళవారం డివైఈఓ పి. రామలక్ష్మణమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల దృష్ట్యా మోటివేషన్ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.