నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ఓ రైతు ఇంట విషాదం నెలకొంది. వివరాల మేరకు మండలంలోని శెట్టి వారి కండ్రిగ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(55) తన పొలంలో వరి కోత కోసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం నుండి వైర్లు తెగి పొలంలో పడి ఉన్నాయి. ఇది గమనించని రైతు వెంకటేశ్వర్లు అటుగా వెళ్లడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.