ఆర్మూర్ పట్టణంలో ఈ నెల 30న తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సుంకాలు _ వ్యవసాయ రంగంపై ప్రభావం, సహకార వ్యవస్థ పునర్జీవం అనే అంశాలపై సెమినార్ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 3:25 సెమినార్ కు సంబంధించిన కరపత్రాలను రైతు సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.