తిరుపతి జిల్లా డక్కిలి మండలం అల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన పరిపాలనా అనుమతులను మంజూరు చేయాలని సీఎం చంద్రబాబుకి ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి ఆదివారం వినతి పత్రం ఇచ్చారు. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తయితే వెంకటగిరి దక్కిలి మండలాల్లో తాగు, సాగునీటి ఎద్దడి ఉండదన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ఆల్తూరుపాడు రిజర్వాయర్ కు సంబంధించి పనులుపూర్తి చేయాలని కోరారు.