ఒంటిమిట్ట మండల పరిధిలోని నరవకాటుపల్లి అరుంధతి వాడ ప్రాథమిక పాఠశాల పైపెచ్చులు కుడుతున్నాయని టిడిపి నాయకుడు గఫూర్ రెహమాన్ పేర్కొన్నారు. పిల్లలు దిక్కుబిక్కుమంటు విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లో అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు అర్జీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయన ఎవరు స్పందించలేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా వెంటనే స్పందించాలని కోరారు.