కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాలాపూర్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణను పచ్చని గడ్డిగా మార్చిన కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల ముందుంచి బహిర్గతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.