యాదాద్రి భువనగిరి జిల్లా: ఓటమి భయంతోనే కేంద్రంలోని మోడీ సర్కార్ జీఎస్టీ స్లాబులను తగ్గించిందని సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు తీవ్రమైన విమర్శలను మంగళవారం చేశారు. మంగళవారం ఆ పార్టీ నాయకులతో కలిసి మోత్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017 జులై 1 నుంచి జీఎస్టీని ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అప్పటినుంచి ప్రతిపక్షాలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన పట్టించుకోలేదన్నారు.