రైతులకు సరైన మోతాదులో యూరియాను అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో యూరియా పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. యూరియా ను దుర్వినియోగం చేయవద్దన్నారు. రైతులందరికీ యూరియాని ఇవ్వాలన్నారు.