ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఏమాత్రం పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పరిష్కరించేలా జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్నా కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.