పత్తి దిగుమతి నుంకం 11శాతం కొనసాగించాలని, పత్తికి మద్దతు ధర రూ.10,075/ ఇవ్వాలని ఎఐకెఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్ కేఎం జిల్లా కన్వినర్ కొండపర్తి గోవిందరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10న జరిగే రైతు అవగాహన సదస్సు ప్రచారంలో భాగంగా చింతకాని మండలం రాఘవాపురంలో ప్రచారం నిర్వహించారు.