గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సుంకన్న అనే వృద్ధుడు పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కడుపునొప్పి, కుటుంబ కలహాలు భరించలేక పెట్రోల్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.