GD నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై CBIతో విచారణ జరిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పలువురు తమిళనాడు వాసులు అక్రమంగా క్వారీల నిర్వహణ, గ్రావెల్, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. తాను దాదాపు వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించానని, ఏ ఒక్కరి వద్ద రూపాయి కూడా వసూలు చేయలేదని స్పష్టం చేశారు.