గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ సీఐ రంగస్వామి శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు మూసి ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.