శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పుట్టపర్తి మండలం మైలసముద్రం వద్ద ఆటోను బొలెరో వాహనం వేగంగా ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన మహిళల మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మార్చురీకి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.