అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంలో స్త్రీ శక్తి విజయోత్సవ సభను కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆడిటోరియంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని అల్లూరి ఏజెన్సీలో విజయవంతంగా అమలు అవుతున్నందున ఈ సభను నిర్వహించామని తెలియజేశారు. ముందుగా స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక మహిళలంతా దింసా లు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అభిమానులు స్థానిక మహిళలు పాల్గొన్నారు.