Parvathipuram, Parvathipuram Manyam | Aug 25, 2025
తొలగించిన తమ పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాధిత దివ్యాంగులు వైసిపి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవిటితనంతో బాధపడే దివ్యాంగులు పెన్షన్లు తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే పింఛన్లను పునరుద్ధరించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.