పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కమలాపురం నియోజకవర్గం పరిధిలోని బుగ్గలేటిపల్లిలోని తన క్యాంప్ సైట్ లో 69వ రోజు మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.