రేణిగుంట (M) గాజులమండ్యం ఎస్సీ కాలనీ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి పుత్తూరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది.