నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం గణపురం గ్రామంలో గురువారం ఉదయం మహిళ దారుణ హత్యకు గురి అయింది, గణపురం గ్రామంలో వదిన సుగాలి నాగమ్మకు మరిది లోకన్నా నాయక్ మధ్య గురువారం ఉదయం ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో లోకన్ననాయక్ ఇనుప రాడ్డుతో నాగమ్మ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది, విషయం తెలుసుకున్న నందికొట్కూరు రూరల్ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.