కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఆరవ రోజు రాత్రి వృషభ వాహన సేవ వైభవంగా జరిగింది. స్వామివారు వృషభ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్, ఏఈఓలు ఎస్.వి. కృష్ణ రెడ్డి, రవీంద్రబాబు, వాహన ఉభయదారులు పాల్గొన్నారు.