నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ ఆసుపత్రిలోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ పనులను 98% పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభించుకుందాం అని అన్నారు .అనంతరం కట్టంగూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.