మూగ బాలికను రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. విశాఖపట్నం సీతమ్మధారలో ఆదివారం సాయంత్రం ఓ మూగ బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలిసిందే. దీనిపై సోమవారం ఆమె ‘X’ వేదికగా స్పందించారు. ఇది మీ అసమర్థ పాలనకు నిదర్శం కాదా అంటూ ప్రశ్నించారు.