రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సోమవారం తెలిసిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు బైక్ జూలై 11న దొంగతనమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సాంకేతిక ఆధారాలతో శివ, రామచందర్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ను అరెస్టు చేసే రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.