కామారెడ్డి పట్టణంలోని జి ఆర్ కాలనీలో మంగళవారం జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ పర్యటించారు.అకాల వర్షాల కారణంగా వరద బాధితులకి తక్షణ సాయం కింద జిల్లా కలెక్టర్ 11500 రూపాయలను మంజూరు చేశారు. ఆ డబ్బులు వచ్చాయా లేదా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని మాట్లాడారు. వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు.