కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రైతులకు యూరియా టోకెన్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఓ రైతు మూర్చతో సోమ్మసిల్లి పడిపోయాడు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం ప్రభుత్వం స్పందించాలని కోరారు. వెంటనే ఆ రైతునే బిబీపేట పోలీసులు పోలీసు వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.