ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై కర్నూలులోని సంక్షేమ భవనం ముందు శనివారం సాయంత్రం 5 గంటలకు ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు, జిల్లా కార్యదర్శి ఎస్. నాగార్జున మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలను పెంచాలన్నారు. సంక్షేమ అధికారులకు వినతిపత్రం అందజేశారు.