విశాఖపట్నంలో వినాయక నిమజ్జనానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నుంచి భారీగా జరిగే ఈ కార్యక్రమం కోసం జోడుగుల పాలెం, ఆర్కే బీచ్లో పెద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు. భారీ విగ్రహాల నిమజ్జనం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరగడానికి ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆరిలోవ సీఐ తెలిపారు. ఈ క్రేన్లు పెద్ద విగ్రహాలను సులభంగా సముద్రంలోకి దించడానికి ఉపయోగపడతాయి. దీంతో భక్తులకు నిమజ్జనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే భక్తులు కూడా గణనాథుల నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలనికోరారు.