Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్రాక్టర్ నడిపి..గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు

Karimnagar, Karimnagar | Sep 5, 2025
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్రాక్టర్ నడిపారు. కరీంనగర్ లో శుక్రవారం గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బండి సంజయ్ స్వయంగా గణేశ్ విగ్రహాన్ని ట్రాక్టర్ లో ప్రతిష్టించారు. ఆ వెంటనే బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేశారు. కరీంనగర్ లో ఘనంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జాగ్రత్తలు పాటిస్తూ నిమర్జనం వేడుకల్లో పాల్గొనాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us