Download Now Banner

This browser does not support the video element.

మంగళగిరి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

Mangalagiri, Guntur | Sep 3, 2025
క్రీడలు విద్యార్థుల శారీరిక, మానసిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జనజాతి విశ్వవిద్యాలయాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 4 వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు - 2025 ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని 171 ఆశ్రమ పాఠశాలలు మరియు 28 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us