సూర్యాపేట జిల్లా: గత ప్రభుత్వంలో శివారు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని శివారు ప్రాంతాలు మున్సిపాలిటీ విలీన గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేకమైన దృష్టి పెడతామని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 14 వ వార్డు స్నేహ నగర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డితో కలిసి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలం యాజమాన్యులకు సమాచారం ఇచ్చి నీటి నిల్వలు ఉండకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు.