ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్స్ లకు మొబైల్స్ అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మరింత పారదర్శకంగా చేపట్టేందుకు మొబైల్స్ అందజేసిందని తెలిపారు.మొబైల్ లో ప్రత్యేకంగా యాప్ ఉంటుందని పెన్షన్ దారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందన్నారు.ప్రతినెల పెన్షన్ దారుల కు ఐరిస్,వేలిముద్ర ద్వారా పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు.