అమలాపురం మండలం రావిగుంట చెరువు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఒక వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.