మచిలీపట్నంలో విషాధం చోటు చేసుకుంది. గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు గాయపడ్డాడు. బలరామునిపేటకు చెందిన రాజు, పల్లి తాళ్లపాలెంకు చెందిన అంకాని వెంకన్న రాడార్ కేంద్రం సమీపంలో ఓ భవన నిర్మాణ పనికి వెళ్లారు. భవన నిర్మాణానికి ఫూటింగ్ తీస్తుండగా పక్కన ఉన్న గోడ కూలి వీరిపై పడగా రాజు అక్కడిక్కడే మరణించాడు. దీంతో మృతుడికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.