హైదరాబాద్ జిల్లా గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రేంజ్ మెంటల్ బజార్లో నలుగురు యువకులు సోమవారం రోడ్డుపై అల్చల్ చేశారు. అటుగా వెళుతున్న ఓ వ్యక్తిని అకారణంగా చితక బాదడమే కాకుండా అక్కడే ఉన్న టీ స్టాల్ నిర్వాహకుడు పై దాడి చేయడంతో పాటు సామాగ్రిని ధ్వంసం చేశారు. స్థానికులు వెంటనే ఇద్దరు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.