మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించి వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి మెడికల్ సీట్లను సాధించిన విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ముఖ్యమైన స్థానం ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు.