జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు కమాన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ మండలంలో మరమ్మత్తులపై అధికారులు స్పందించట్లేదని ఆరోపించారు. మరమ్మతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పడమే తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు.రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు