గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రావులపాలెంలోని ఊబలంక శివారు తోకలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. గౌతమి గోదావరి నదీ గర్భంలో ఉండే ఈ ప్రాంతం నుంచి ఆలమూరు మూల స్థానం వైపునకు అధికారులు ఏర్పాటు చేసిన పడవలపై స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వరద తగ్గే వరకు సెలవులు ప్రకటించామని తహశీల్దార్ బి. ముక్తేశ్వరరావు తెలిపారు.