రాజీమార్గమే రాజ మార్గమని, ఒక కేసులో రాజీ పడటం వల్ల ఇరువర్గాలు ఆ కేసులో గెలిచినట్లే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర ప్రారంభించారు. సత్వర న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు.