ఆడపిల్లలకు 14 ,15 సంవత్సరాలకే పెళ్లిళ్లు చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ బాలికలకు వివాహాలు చేయవద్దని సూచించారు. బాలికలు ప్రస్తుత సమాజంలో ఉన్నతంగా విద్యాభ్యాసం చేస్తున్నారని వారికి మినిమం డిగ్రీ వరకు చదివించి స్థిరపడిన అనంతరం 21 ఏళ్ల తర్వాత వివాహాలు జరిపించాలని సూచించారు.