అనంతపురం నగరంలోని భైరవనగర్ ఏడవ క్రాస్ లో ప్రమాదవశాత్తు రేకులు మీద పడి కిరణ్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతనికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.