ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ , ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఈనెల 26న మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ విశాఖ అధ్యక్షులు పి.నారాయణలు తెలిపారు. ఈ మేరకు గురువారం అక్కయ్యపాలెంలో ఒక ప్రయివేట్ హోటల్ లో ఆయా సంఘాల సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.