అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నులివీడు నుండి గాలివీడు వైపు వెళ్తున్న టెంపో వాహనం, ప్యారంపల్లి సమీపంలో ముందుగా వెళ్తున్న ఎక్స్ఎల్ స్కూటర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా, స్కూటర్పై ప్రయాణిస్తున్న వ్యక్తి, టెంపో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని 108 అంబులెన్స్ సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.