గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మర్రిపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ మహా కుంభాభిషేకం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామి దేవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి జరగాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.